దుండిగల్ జూన్ 14:రానున్న రోజుల్లో నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేలా కృషి చేస్తున్నానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నా రు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధి, 11వ వార్డులోని గార్డెన్హౌసింగ్ సొసైటీలో ‘ఆగాఖాన్ హెల్త్ బోర్డు ఫర్ సదరన్ ఇండియా ’ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే మూడు టీకా కేంద్రాలను ఏర్పా టు చేసి వ్యాక్సిన్లు వేస్తున్నట్లు తెలిపారు. సరిపడా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే నియోజకవర్గం పరిధిలోని ప్రతిఒక్కరికీ టీకాలు వేసేలా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, వైద్యసిబ్బంది, గార్డెన్ హౌసింగ్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
నియోజకవర్గం పరిధిలో గడిచిన 15 రోజులుగా 46వేల 173 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. వీరిలో సోమవారం ఒక్కరోజే 3337 మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. గాజులరామారం సర్కిల్ పరిధిలో 911 మంది సూపర్స్ప్రెడర్లు టీకాలను తీసుకోగా, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రంలో 1319 మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మొత్తం 792 మంది వ్యాక్సిన్లు తీసుకోగా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి, కొంపల్లి పరిధిలో 315 మంది వ్యాక్సిన్లు తీసుకున్నట్ల్లు అధికారులు స్పష్టం చేశారు.