తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రియేటివ్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. హిట్ ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు అభిమానులు ఉంటారు. మూడేళ్ల కింద రంగస్థలం సినిమాతో తన రేంజ్ ఏంటో తెలుగు ఇండస్ట్రీకే కాదు.. ఇండియన్ సినిమాకు రుచి చూపించాడు సుకుమార్. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా రూ.125 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీలో రికార్డులన్నీ తిరగరాసింది. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ కరోనా బ్రేక్ తర్వాత ఈ మధ్య తిరిగి షూటింగ్ మొదలు పెట్టారు. రెండు భాగాలుగా ఈ సినిమా వస్తుంది. మొదటి భాగాన్ని 2021 డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే 2021లో వచ్చేలా కనిపించడం లేదు.
2022 సంక్రాంతికి పుష్ప 1 విడుదలయ్యేలా కనిపిస్తుంది. రెండో భాగం ఆరు నెలలు గ్యాప్లో తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు సుకుమార్. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు సుకుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు గత రెండు రోజులుగా జ్వరం ఉందని.. కాస్త ఎక్కువగానే ఉండటంతో ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మొదటి నుంచి కూడా సుకుమార్ ఇంగ్లీష్ మందులు, మెడిసిన్స్, ఇంజక్షన్లకు దూరం. కేవలం హోమియోపతి మాత్రమే వాడుకుంటాడు సుకుమార్. ఇప్పుడు కూడా హోమియోపతి మందులు వాడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు పుష్ప షూటింగ్కు విరామం తప్పకపోవచ్చు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన పూర్తి స్థాయిలో కోలుకుంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
ఆర్య ఇంట డబుల్ ధమాకా.. తల్లి అయిన అఖిల్ హీరోయిన్.. విశాల్ ఎమోషనల్
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా