టెంపుల్ బెల్ డిజిటల్ సంస్థ గత ఏడాది అంతర్జాలంలో నిర్వహించిన తెలుగు డిజిటల్ తొలి సీజన్కు మంచి స్పందన లభించింది. దాంతో ఈ ఏడాది ‘తెలుగు డిజిటల్ సీజన్-2’ను ప్రముఖ గాయకుడు మనో ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. గాయకులు, సంగీత దర్శకుడు పార్థసారథి, గాయని విజయలక్ష్మి ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. కిన్నెర థియేటర్స్, ఎలెవన్ పాయింట్ సంస్థల సహకారంతో ఈ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నామని, పదహారు సంవత్సరాలు నిండిన వారు పాల్గొనడానికి అర్హులని, మే 15న రిజిస్ట్ట్రేషన్ గడువు ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. సంస్థ వెబ్సైట్లో శనివారం నుంచే రిజిస్ట్రేషన్ ఆరంభించారు.