మనామా: ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా భారత మహిళల ఫుట్బాల్ జట్టు స్వీడన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది. అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ల్లో ఇప్పటికే పలు విజయాలు సాధించిన టీమ్ఇండియా స్వీడన్లో ప్రముఖ సాకర్ క్లబ్లు హమ్మర్బే ఐఎఫ్, జుగార్డెన్ ఎఫ్తో తలపడుతుంది. ఇందుకోసం అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) గురువారం ఎంపిక చేసిన జట్టులో తెలంగాణ స్టార్ ప్లేయర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ జట్లతో మ్యాచ్ల్లో అంచనాలకు మించి రాణిస్తున్న సౌమ్య.. కీలక ప్లేయర్గా ఎదిగిందని రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ అన్నారు.