తమిళనాడు దివంగత మాజీ సీఎం, సినీ నటి జయలలిత జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం తలైవి. కంగనారనౌత్ లీడ్ రోల్ పోషిస్తుండగా..అరవింద్ స్వామి, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధుబాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. తలైవిలో ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన్ గా నటిస్తోంది మధుబాల.
హాస్పిటల్లో బెడ్ పై ఉన్న ఎంజీ రామచంద్రన్ (అరవింద్స్వామి)తో ఆప్యాయంగా మాట్లాడుతున్న స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. మధుబాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూ లుక్ పోస్టర్ ను షేర్ చేసుకుంది కంగనారనౌత్. విబ్రీ మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్మైన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకుడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 23న విడుదల కానుంది.