తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వేడుకలు జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగుర వేశారు. స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. తెలంగాణ సాధించుకున్న తీరును గుర్తు చేసుకున్నారు. నల్లగొండ కలెక్టరేట్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సూర్యాపేట పరేడ్గ్రౌండ్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగుర వేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు.
తొలి రోజు జాతీయ జెండాల ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వరకు జరుగునున్న ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు శుక్రవారం ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ జాతీయ జెండాలను ఎగురవేసి వందనం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరుల స్తూపం వద్ద పూలమాల ఉంచి అమరులకు నివాళులు నల్లగొండ కలెక్టరేట్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, భువనగిరిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి జాతీయ జెండాలను ఎగురవేశారు. సూర్యాపేటలో ప్రదర్శించిన ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాల్స్ ఆకట్టుకున్నాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.