ఖమ్మం, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గుర్తుచేశారు. ఆయన చూపిన బాటలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం ముందుకెళ్తోందని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా సోమవారం నగరంలోని ధంసలాపురం రైల్వే వంతెన సర్కిల్లోగల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి కలెక్టర్ కర్ణన్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ నేతలు ఆర్జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.