బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా హిందీ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. మోడల్ రంగంలో మిస్ ఇండియా యూనివర్స్గా 2005లో పేరు సంపాదించుకుంది. అందం, అభినయం ఉన్న ఈమె 2005లో ఆశిక్ బనాయా ఆప్నే అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. 2006లో వీరభద్ర సినిమాతో తెలుగు తెరకు కూడా పరిచయం అయింది.
2007లో చివరిసారిగా కనిపించిన తనూశ్రీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. 14 సంవత్సరాల తర్వాత ఈవిడ రీఎంట్రీకి సిద్ధం అయినట్టు తెలుస్తుంది. అయితే తనూశ్రీ సింగిల్గా ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులని పలకరిస్తున్న తనూశ్రీ న్యూ లుక్ కి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తుంది. వినాయక చవితికి పండుగకు ముందు ఈ అమ్మడు క్యూట్ లుక్స్లో ఫొటో షూట్ చేసి ఆ పిక్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ మధ్య భారీగా బరువు తగ్గిన తనూశ్రీ స్లిమ్గా మారింది. అయితే 17 కేజీల బరువు తగ్గకముందు ఇలా ఉన్నాను అంటూ లేటెస్ట్గా ఓ పిక్ షేర్ చేసింది తనూశ్రీ. ఇది నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. 2005లో బాలీవుడ్లో అడుగుపెట్టిన తనుశ్రీ ఒకేసారి చాకొలేట్, ఆషిక్ బనాయా ఆప్నే సినిమాల్లో నటించింది. చాకొలేట్ తొలి చిత్రం కాగా ఆషిక్ బనాయా ఆప్నే చాకొలేట్ కంటే ముందే విడుదలైంది.