ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ మరికొద్ది రోజులలో చిత్ర షూటింగ్ పూర్తి చేసి శంకర్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇండియన్ 2 సినిమా వివాదాన్ని వదిలించుకున్న శంకర్ ఇక నుంచి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాడు. వీలైనంత వరకు దిల్ రాజు పై అత్యదిక బడ్జెట్ భారం వేయకుండా సినిమాను చాలా ప్లాన్డ్గా తీయాలని భావిస్తున్నాడు.
సాధారణంగా శంకర్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ ఉండదు. అందుకు కారణం ఆ సినిమా పర్ఫెక్ట్గా వచ్చే వరకు తీస్తూనే ఉంటాడు. కాని రామ్ చరణ్ సినిమా విషయంలో పక్కా క్లారిటీ ఇచ్చాడు. సినిమాను 2022 సమ్మర్ లోపు పూర్తి చేస్తానని దిల్ రాజుకి చెప్పాడట. కొద్ది రోజులుగా సినిమా కాస్టింగ్ ఎంపిక జరుగుతుండగా, కథానాయికగా కియారాని ఎంపిక చేశారు.
మరో హీరోయిన్ గా తమన్నాని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. విలన్ భార్యగా తమన్నా నటిస్తోందట. హీరోయిన్ కి సమాంతరంగా ఉన్న పాత్రలో తమన్నా కనిపించి అలరించనున్నట్టు తెలుస్తుంది. విలన్కి భార్య అంటే ఆమె రోల్ కూడా కొంచెం నెగెటివ్ షేడ్లోనే ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే తమన్నా మ్యాస్ట్రో చిత్రంలో నెగెటివ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పలువురు బాలీవుడ్ ఆర్టిస్ట్లు కూడా నటించనున్నట్టు టాక్.