లక్నో : ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝాన్సీ మీర్జాపూర్ జాతీయ రహదారిలోని రాయ్పురా పోలీస్స్టేషన్ ప్రాంతంలోని రామ్నగర్ సమీపంలో ఆదివారం ఉదయం డంపర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తల్లీ, కూతురు సహా నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. పోలీసులు, స్థానికుల సహాయంతో గాయపడ్డ వారిని కారు నుంచి బయటకు తీసి అంబులెన్స్లో జిల్లా దవాఖానకు తరలించారు. మృతులను మహోబా జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రయాగ్రాజ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..