హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 7 నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ను వాయిదా వేస్తూ బోర్డు నిర్ణయం వెలువరించింది. వాయిదా పడిన ప్రాక్టికల్స్ను మే 29 నుంచి జూన్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. థియరీ పరీక్షల తర్వాతే ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.