ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. కివీస్తో WTC ఫైనల్ పోరుకు, ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు 20 మందితో జంబో జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.
ఇటీవల ఐపీఎల్లో పరుగుల వరద పారించిన యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కలేదు. పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేయలేదు. ఐపీఎల్లో ఆడిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు నిరాశే ఎదురైంది. గాయం నుంచి కోలుకున్న తెలుగు ఆటగాడు హనుమ విహారి జట్టులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా(వికెట్కీపర్) ఈ ఇద్దరు ఆటగాళ్లను ఫిట్నెస్ను పరిశీలించి ఇంగ్లాండ్కు పంపనున్నారు. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 14 వరకు ఆతిథ్య ఇంగ్లాండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ జరగనుంది
భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవవ్
స్టాండ్బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా