అగ్ర కథానాయికలు ఐటెంసాంగ్స్లో మెరవడం మామూలే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాయికలు సైతం ఆటవిడుపుగా ప్రత్యేక గీతాల్లో నర్తిస్తుంటారు. ఐటెంసాంగ్స్కు మాస్లో ఉన్న క్రేజ్ ఇందుకు కారణంగా చెబుతారు. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా ‘గని’ చిత్రంలో ప్రత్యేకగీతంలో నటించనుంది. వరుణ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొరపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కథానుగుణంగా ఓ ముఖ్యమైన సందర్భంలో ఈ ఐటెంసాంగ్ను చిత్రీకరించనున్నారట. ఇందుకోసం చిత్రబృందం తమన్నాను సంప్రదించగా ఆమె అంగీకరించిందని చెబుతున్నారు. నృత్యం విషయంలో అద్భుత ప్రతిభ కనబరిచే తమన్నా ఈ ప్రత్యేకగీతంలో యువతరాన్ని హుషారెత్తిస్తుందని అంటున్నారు. తమన్నా గతంలో ‘జై లవకుశ’ ‘కేజీఎఫ్’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాల్లో ఐటెంసాంగ్స్లో మెప్పించింది. మరోవైపు తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్-3’ ‘మాస్ట్రో’ ‘సీటీమార్’ చిత్రాల్లో నటిస్తోంది.