దుబ్బాక, మే 5 : మండలంలో బుధవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షానికి దుబ్బాక మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డు సిబ్బంది ముందస్తుగా రైతులకు టార్పాలిన్ల్లు అందజేశారు. రైతులు ఆందోళన చెందొద్దని.. ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఏఎంసీ చైర్మన్ బండి శ్రీలేఖ తెలిపారు.
తడిచిన ధాన్యం..
తొగుట, మే 5 : మండల పరిధిలోని తొగుట, వెంకట్రావుపేట, చందాపూర్, జప్తిలింగారెడ్డిపల్లి, రాంపూర్, బండారుపల్లి, పెద్దమాసాన్పల్లి గ్రామాల్లో ఆకాల వర్షం కురిసింది. ఫలితంగా పొలాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచింది. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టగా.. అకస్మాత్తుగా వర్షం కురువడంతో తడిచిపోయింది.
కొనుగోలు కేంద్రాల్లోకి చేరిన నీరు
సిద్దిపేట అర్బన్, మే 5 : మండలంలోని చింతమడక, రావురూకుల, రాంపూర్, ఇర్కోడు తదితర గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోకి నీరు చేరి, ధాన్యం తడిసింది. చేతికొచ్చిన ధాన్యం తడిసి పోవడం తో అన్నదాతలు ఆందోళన చెందారు.
గజ్వేల్లో గాలివాన
గజ్వేల్ అర్బన్, మే 5 : నియోజకవర్గంలోని గజ్వే ల్, వర్గల్, జగదేవ్పూర్, ములుగు, కొండపాక, మర్కూక్ మండలాల్లో భారీస్థాయిలో గాలులు వీచా యి. అరగంటకు పైగా గాలి తో కూడిన వాన రావడంతో ధాన్యం తడిసింది. అలాగే, మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
మధ్యాహ్నం ప్రాంతంలో చిరుజల్లులు
జహీరాబాద్/ హత్నూర, మే 5 : జహీరాబాద్ పట్టణంతోపాటు మండలంలో మధ్యాహ్నం ప్రాంతంలో చిరుజల్లులు కురిశాయి. హత్నూర మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.