ఒకప్పుడు హీరోల పక్కన నటిస్తూ అలరించడమే కథానాయికల పని. కాని ఇప్పుడు అలా కాదు నిర్మాతలుగా మారి వైవిధ్యమైన సినిమాలు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే అనుష్క శర్మ నిర్మాతగా మారి ‘ఎన్హెచ్ 10’ తీసి విజయం సాధించారు. ప్రియాంకా చోప్రా కూడా ఓ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా తాప్సీ కూడా సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. పీకూ, సూర్మ వంటి చిత్రాలను నిర్మించిన ప్రాంజల్ ఖాండ్డియాతో కలిసి తాప్సీ ఔట్ సైడర్ ఫిలింస్ అనే బేనర్పై సినిమాలు నిర్మించనుంది తాప్సీ.
తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను భయపెట్టిన ‘కాంచన’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకుంటుందట తాప్సీ. ఆమె నిర్మాణంలో రూపొందనున్న తొలి సినిమా ఇదే అని అంటున్నారు. ప్రస్తుతం ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఏ హీరోయిన్ లేనంత బిజీగా గడుపుతోంది తాప్సీ. దీంతో ఈ భామ టాలీవుడ్కి దూరమైపోయింది. మహి డైరక్షన్ లో ఆనందోబ్రహ్మ సినిమా తర్వాత తాప్సీ తెలుగు సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం స్వరూప్ దర్శకత్వంలో మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమా చేస్తుంది. అలానే మిథాలి బయోపిక్లోను నటిస్తుంది.