ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది ఢిల్లీ సోయగం తాప్సీ. ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు తెలుగు సినిమాల్లో నటించింది. కొన్నాళ్లుగా హిందీలో ఫర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంది. ఈ భామ మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో మెరువబోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వరూప్ ఆర్జే డైరెక్ట్ చేస్తున్న చిత్రం మిశన్ ఇంపాజిబుల్.
తిరుపతిలో బౌంటీ హంటర్స్ (డబ్బులు తీసుకుని చంపే వేటగాళ్లు) చుట్టూ తిరిగే ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో తాప్సీ తిరుపతికి చెందిన జర్నలిస్టుగా కనిపించనుందని టాక్. అంతేకాదు తాప్సీ పాత్ర చుట్టూ చాలా క్యూరియాసిటీ ఉంటుందట. ఈ మూవీలో తాప్సీ రోల్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని ఫిలింనగర్ సర్కిల్ ఇన్ సైడ్ టాక్. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?