ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన తాప్సీ ఆ తర్వాత ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ వరస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంది. దీంతో ఆమెకు స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు లభించింది. అయితే ‘గేమ్ ఓవర్’ తర్వాత ఆమె నుంచి మరో తెలుగు చిత్రమేదీ రాలేదు.
స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రంతో ఇప్పుడు మళ్లీ టాలీవుడ్కి రీఎంట్రీ ఇస్తుంది తాప్సీ. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి విజయం తర్వాత స్వరూప్ నుంచి వస్తున్న రెండో చిత్రం మిషన్ ఇంపాజిబుల్ కాగా ఇందులో తాప్సీ నటిస్తుందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో తాప్సీ పాత్రకి ఎంతో ప్రాధాన్యముందని, కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంటుందని ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమాని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. మార్క్.కె.రాబిన్ స్వరాలందిస్తున్నారు.