ఝుమ్మంది నాదం సినిమాతో వెండితెరకు పరిచయమైన అందాల సుందరి తాప్సీ. ఈ అమ్మడు కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్లో ఒకరిగా మారింది. ప్రతి సినిమాను ప్రాణం పెట్టి చేసుకుంటూ వెళుతున్న తాప్సీ.. ప్రస్తుతం రష్మీ రాకెట్ అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో గుజరాతీ స్పింటర్ రష్మీ పాత్రలో నటిస్తోంది.
ఈ పాత్ర కోసం తాప్సీ చాలా కష్టపడింది. ఆమె ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అయితే ఇటీవల సినిమా ప్రమోషన్ లో భాగంగా తానూ వెనక్కి తిరిగి ఉన్న ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ ‘ఎవరో చెప్పుకోండి?’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీనికి ఓ నెటిజన్..ఆ శరీరం తాప్సీకి మాత్రమే ఉంటుంది అని సెటైరికల్గా మెసేజ్ పెట్టాడు.
నెటిజన్ కామెంట్కి హుందాగా ప్రవర్తించిన తాప్సీ.. ‘సెప్టెంబర్ 23 వరకు ఈ లైన్ గుర్తుపెట్టుకో, నేను ఈ ప్రశంస కోసం చాలా కష్టపడ్డాను. నీకు ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చింది. అథ్లెట్ పాత్ర కోసం తాప్సీ చాలా కష్టపడగా,ఆమెపై ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాని అక్టోబర్ 15న జీ5 యాప్లో విడుదల చేయనున్నారు. మరోవైపు తాప్సీ మిథాలీ రాజ్ బయోపిక్లోను నటిస్తుంది.