న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న మొత్తం కొవిడ్-19 కేసుల్లో 12 రాష్ట్రాల్లోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక అంతకుముందు రోజు భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైన క్రమంలో గడిచిన 24 గంటల్లో కొంత ఊరటనిచ్చేలా తాజా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది.
కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ లను పొడిగిస్తుండగా మరికొన్ని రాష్ట్రాలు తాజాగా తమ పరిధిలో లాక్ డౌన్ లు విధించడం, కఠిన నియంత్రణలను అమలుచేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేపట్టి పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని కోరుతూ 13 విపక్షపార్టీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి.