దియోఘడ్ : జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఏకైక అసెంబ్లీ ఎన్నికలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆధిక్యంలో కొనసాగుతున్నది. మధుపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో జేఎంఎం అభ్యర్థిగా ఆ రాష్ట్ర మైనార్జీ సంక్షేమ మంత్రి హఫీజుల్ హసన్ అన్సారీ, బీజేపీ అభ్యర్థిగా గంగా నారాయణ్ సింగ్ బరిలో నిలిచారు. ప్రస్తుతం ఏడో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి జేఎంఎం అభ్యర్థి అన్సారీ బీజేపీ అభ్యర్థి గంగా నారాయణ్ సింగ్పై 4100 పైచిలుకు ఓట్ల ఆధిక్యం సాధించారు.
గత నెల 17 న జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ, జేఎంఎం అభ్యర్థులతోపాటు మరో నలుగురు స్వతంత్రులు బరిలో నిలిచారు. మధుపూర్ అసెంబ్లీ ఎన్నికను అటు జేఎంఎం, ఇటు బీజేపీ.. రెండూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్సోరేన్ ఇక్కడే క్యాంపు వేసి తన పార్టీ అభ్యర్థికి ప్రచారం నిర్వహించారు. దాదాపు 8 రోజులపాటు ఇక్కడే ఉండి తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి చేరేలా చేయడంలో కృతార్థులయ్యారు.
అలాగే, బీజేపీ కూడా ఈ స్థానాన్ని ఛాలేంజిగానే తీసుకున్నది. ఈ సీటును గెలిచేందుకు బీజేపీ సీనియర్ నేత బాబూలాల్ మరాండీ తీవ్రంగా ప్రచారం చేపట్టారు.
ఉత్తరాఖండ్ ఉప ఎన్నిక : బీజేపీ ముందంజ
ఎంపీ ఉప ఎన్నిక : దమోహాలో కాంగ్రెస్ ముందంజ
రాజస్థాన్ ఉప ఎన్నిక : ఒక్క స్థానంలో బీజేపీ, రెండింటిలో కాంగ్రెస్ ఆధిక్యం
యూపీలో వారాంతపు లాక్డౌన్ సమయం పొడగింపు
అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ
ఆధిక్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
పుదుచ్చరిలో ముందంజలో ఎన్డీఏ కూటమి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..