‘నాలోని నటుడిని పరిపూర్ణ స్థాయిలో సంతృప్తిపరిచిన చిత్రమిది. రొటీన్కు భిన్నంగా రియలిస్టిక్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని అన్నారు సుశాంత్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకుడు. రవిశంకర్శాస్త్రి, ఏక్తాశాస్త్రి, హరీష్ కోయలగండ్ల నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ను అగ్రహీరో నాగార్జున విడుదలచేశారు. ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ ‘కొత్తదనంతో కూడిన సినిమా ఇది. నటుడిగా నాకు వైవిధ్యతను ప్రదర్శించే అవకాశం దొరికింది. తొలుత దర్శకుడు దర్శన్ వేరే కథ వినిపించారు. కానీ జోనర్ నచ్చకపోవడంతో ఈ పాయింట్ చెప్పారు. చాలా నచ్చింది. ‘చిలసౌ’ అలాగే చేశా. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు కలిసోస్తుందనే నమ్మకముంది’ అని అన్నారు.తన జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాసుకున్న కథ ఇదని దర్శకుడు చెప్పారు. ‘ఏఎన్నాఆర్ గారి మనవడు సుశాంత్, భానుమతి గారి మనవడు రవిశంకర్శాస్త్రి కలిసి చేస్తున్న చిత్రమిది. సార్వజనీన కథాంశంతో తెరకెక్కించాం. కామెడీ, రొమాన్స్, యాక్షన్తో పాటు వాణిజ్య హంగులన్నీ ఉంటాయి’ అని నిర్మాతల్లో ఒకరైన హరీష్ పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత తాను సంగీతాన్ని అందిస్తున్న చిత్రమిదని ప్రవీణ్ లక్కరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అభినవ్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.