పేదరికం రూపుమాపేందుకు భూదానం ఒక్కటే మార్గం అని తలంచిన ఆచార్య వినాబా భావే.. ఏడు దశాబ్దాల క్రితం సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. భూమి కోసం ప్రపంచ చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగినా.. ప్రేమపూర్వకంగా భూమిని అందుకున్న సందర్భం కేవలం భూదానోద్యమం ద్వారానే నెరవేరింది. తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో 1951 ఏప్రిల్ 18 న వినోబా భావే ఈ భూదానోద్యమానికి ప్రాణం పోశారు.
శాంతియాత్ర కోసం పోచంపల్లికి వచ్చిన వినోబా భావే.. దళితవాడ సమీపంలోని చెరువుకట్ట వద్ద దళితులతో సమావేశమయ్యారు. వారి యోగక్షేమాలు అడిగే క్రమంలో భూమిస్తే.. సాగుచేసుకుని జీవిస్తాం అనే మాట వినబడింది. దాంతో వినోబాజీ భూస్వాములు ఎవరైనా ముందుకు వచ్చి భూమి ఇవ్వగలరా? అని కోరారు. వెంటనే వెదిరె రామచంద్రారెడ్డి అనే భూస్వామి సేద్యయోగ్యమైన 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తానని ప్రకటించారు.
అదే నిండు సభలో లభించిన భూమిని వినోభాబావే దళితులకు పంచి భూదానోద్యమానికి అంకురార్పణ చేశారు. అప్పటి నుంచి పోచంపల్లి తన పేరును ‘భూదాన్’పోచంపల్లిగా మార్చుకుంది. ఆచార్య వినోబాభావే పోచంపల్లిలో మొత్తం మూడు సార్లు పర్యటించి లక్షా 70 వేల ఎకరాల భూమిని సేకరించారు.
దేశవ్యాప్తంగా ఈ ఉద్యమానికి ఊపిరిలూదిన వినోబా భావే.. మొత్తం ఏడు కోట్ల ఎకరాలు సేకరించి పేదలకు పంచాలన్న లక్ష్యంగా పెట్టుకుని దాదాపు కోటిన్నర ఎకరాలను పేదలకు అందేజేశారు. భావే భూస్వాములను బెదిరించి, భయపెట్టి వారి భూమిని లాక్కొనే ప్రయత్నం చేయలేదు. భూమిపై వారిలో పాతుకుపోయిన మమకారాన్ని వదులుకునేలా ప్రేరేపించి ఈ భూదానోద్యమాన్ని దేశం దశదిశలా వ్యాపింపజేశారు.
1996: కైరోలో 17 మంది పర్యాటకులు కాల్చివేత
1994 : వన్డేల్లో గ్యారీ సోబర్స్ రికార్డును బద్దులకొట్టి 375 పరుగులు చేసిన బ్రయన్లారా
1991: దేశంలో మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ ప్రకటన
1980: బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న జింబాబ్వే
1978: ఆధునిక న్యూఢిల్లీని నిర్మించిన శోభా సింగ్ మరణం
1955 : ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్స్టీన్ కన్నుమూత
1948: నెదర్లాండ్స్లోని హేగ్లో అంతర్జాతీయ న్యాయస్థానం ప్రారంభం
1924 : క్రాస్ వర్డ్ పజిల్ పుస్తకం మొదటిసారి ప్రచురణ
1902: నేరస్థులను గుర్తించడానికి వేలిముద్రలను నమోదు చేయడం ప్రారంభించిన డెన్మార్క్
1859 : స్వాతంత్య్ర ఉద్యమకారుడు తాంతియా తోపే ఉరితీత
1621: సిక్కుల తొమ్మిదవ గురువు గురు తేగ్ బహదూర్ జననం
గ్రహాంతరవాసులతో పరిచయానికి దగ్గరికొస్తున్న మానవుడు..!?
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
స్పేస్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన వ్యోమగామి కేట్ రూబిన్స్
మేధోసంపత్తి అడ్డంకులు తొలగించండి.. బైడెన్కు ఎంపీల వినతి
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..