న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరిగిపోయింది. అంతేగాక రోజూ 10 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత మూడు వారాలుగా అక్కడ లాక్డౌన్ కొనసాగుతున్నా పరిస్థితి అలాగే ఉన్నది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రివాల్ ఢిల్లీలో కరోనా పరిస్థితిపై ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలో కరోనా విస్తృతి, ఆ మహమ్మారి కట్టడి కోసం ఇంకా చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కూడా హాజరుకానున్నారు.