మునిపల్లి, జూన్ 2 : వికారాబాద్ జిల్లా పరిగి గ్రామానికి చెందిన వెంక ట్ అనే యువకుడు ముంబైలో సోనూసూద్ను కలిసేందుకు రెండు రోజుల కింద పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. బుధవారం వెంకట్ పాదయాత్రగా మునిపల్లి మండలం బుధేరా చౌరస్తాకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా స్థానికులు వెంకట్ను కలిసి అభినందించి పలు సూచనలు, సలహాలు ఇచ్చా రు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడు తూ.. కనిపించని దేవుడి కన్నా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే సోనూసూద్ను దేవుడిగా భావిస్తున్నానని చెప్పారు. ముంబై వరకు పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు సోనూసూద్కు మెసేజ్ చేసినట్లు తెలిపారు.