మేడ్చల్, మే 16(నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలోనూ గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మేడ్చల్ జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.2కోట్ల78లక్షల57వేల నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య ప్రణాళిక, నర్సరీలు, హరితహారం, కంపోస్ట్ యార్డులు, వైకుంఠదామాల నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే 90శాతం పనులు పూర్తికాగా.. మిగితా పనులను పూర్తిచేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ బాధితులకు ఐసొలేషన్ వసతి కల్పించేందుకు సైతం ఈ నిధులను వినియోగించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది.