తమిళ స్టార్ హీరో సూర్య విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. త్వరలో జై భీమ్ అనే సినిమాతో సూర్య ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇందులో లాయర్గా సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళంలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.
సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారాను మంచి సినిమాలు నిర్మిస్తున్నారు. ‘ఓ మై డాగ్’, ‘రామే ఆండాలుం రావణే ఆండాలుం’ ‘ఉడన్పిరప్పే’ చిత్రాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. చివరిగా సూరరై పోట్రు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య ఈ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా ఐ.ఎఫ్.ఎఫ్.ఎం. అవార్డుకి ఎంపికయ్యారు
రాను రాను తన ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తున్న సూర్య తాజాగా తన ట్విట్టర్లో ఓ ఫాస్టెస్ట్ రికార్డు సెట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆరేళ్లలో సూర్య ట్విట్టర్ ఖాతా మొత్తం 70 లక్షల మంది ఫాలోవర్స్ కి చేరుకుంది. ఇంత ఫాస్ట్గా ఆ రికార్డ్ చేరుకోవడం ఏ సౌత్ హీరోకి సాధ్యం కాలేదు. ఫాస్టెస్ట్ 7 మిలియన్ ఫ్యామిలీ రికార్డును సొంతం చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
సూర్య నటిస్తున్న జై భీమ్ చిత్రం టి.ఎస్.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతుంది. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇందులో గిరిజనుల తరఫున పోరాడే న్యాయవాదిగా కనిపించనున్నారు సూర్య. ఈ చిత్రంలో రజిషా విజయన్ నాయికగా నటిస్తోంది. ప్రకాశ్ రాజ్, మణికందన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తున్నారు. కథానాయకుడిగా సూర్యకి ఇది 39వ చిత్రం