ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తన అభిప్రాయాలను బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. సురేశ్ బాబు సహ నిర్మాతగా వ్యవహరించిన నారప్ప చిత్రం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు సురేశ్ బాబు. సినిమాల మేకింగ్ గురించి ప్రశ్నించగా..ప్రస్తుత జనరేషన్ లో ప్రేక్షకుల పల్స్ ను పసిగట్టి, దానికనుగుణంగా సినిమాలు తీయాలని అన్నారు. ప్రేక్షకుల నాడిని పసిగట్టడంలో ఫెయిలైతే నిర్మాత సినిమాలు నిర్మించడం మానేసి..వేరే పనిపై దృష్టిపెట్టాలని సూచించారు.
స్టార్ ప్రొడ్యూసర్ అయిన సురేశ్ బాబు చేతిలో ప్రస్తుతం ఏడు సినిమాలు ఉండగా..అవి ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. వీటి నుంచి త్వరలో వెంకటేశ్-మీనా నటించిన దృశ్యం 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని డీ సురేశ్ బాబు, రాజ్కుమార్ సేతుపతి, ఆంటోని పెరుంబవూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సినిమాలకు యువ హీరో గుడ్బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?