ఈ మధ్య సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చతోనే ఫేమస్ అవుతున్నారు నటి సురేఖ వాణి. ఈమె ఇస్తున్న వార్నింగులు.. చేస్తున్న కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోవడంపై మనసులో మాట చెప్పింది సురేఖ. ఈ మధ్య రెండో పెళ్లి కామన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రముఖులు రెండో పెళ్లి చేసుకున్నారు. అందులో దిల్ రాజు, సామ్రాట్ రెడ్డి, సునీత లాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఇదే ఆలోచన నటి సురేఖ వాణి కూడా చేస్తుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈమెతో పాటు మంచు మనోజ్ కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై చాలా ఫన్నీగా స్పందించాడు మనోజ్. డేట్, టైమ్ కూడా మీరే చెప్పేయండి అంటూ ట్వీట్ చేసాడు. దాంతో ఇదంతా ఫేక్ అని అర్థమైపోయింది.
మరోవైపు సురేఖ వాణి విషయంలోనూ ఇదే జరిగింది. యాంకర్గా కెరీర్ను ప్రారంభించిన సురేఖ తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. తమిళంలోనూ ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ కూడా భారీ సినిమాలలో నటించింది సురేఖ వాణి. ఆ తర్వాత కారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె త్వరలోనే రెండో వివాహం చేసుకుంటుందంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది ఈమె. ఆమె కుమార్తె సుప్రీత నిర్ణయం ప్రకారమే సురేఖ ఏడడుగుల వైపు మొగ్గు చూపుతుందని సోషల్ మీడియాలో వార్తలు బాగా గట్టిగానే వచ్చాయి. అలాంటివేం లేవని.. తాను రెండోపెళ్లి చేసుకునే సమస్యే లేదని ఇప్పటికే ఓ సారి తేల్చేసింది. ఇదే విషయంపై ఆ మధ్య ఈమె కూతురు సుప్రీత కూడా జర్నలిస్టులపై మండిపడింది. నిజానిజాలు ఏది పడితే అది రాస్తే ఎలా అంటూ ఫైర్ అయింది.
ఉన్నవి రాయండి..లేనివి క్రియేట్ చేసి రాయకండి..అంటూ ఫైర్ అయింది సుప్రీత. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ మరోసారి కొందర్ని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది సురేఖ వాణి. దానికి కూతురు సుప్రీత నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. నకిలీ మనుషులను దూరం పెట్టండి.. ఒట్టి మాటలను నమ్మకండి.. అలాంటప్పుడే మన జీవితం సంతోషంగా సుఖంగా ఉంటుందంటూ తల్లి పెట్టిన పోస్టును షేర్ చేసింది సుప్రీత. అయితే ఈ మాటలు ఇప్పుడెందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. త్వరలోనే సుప్రీత కూడా ఇండస్ట్రీకి రాబోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న గ్లామర్ రచ్చకు అంతా ఫిదా అయిపోతున్నారు. దాంతో పాటు కాంట్రవర్సీ కామెంట్స్ తో తల్లీకూతుళ్లు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటున్నారు.