కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గొండు నాయకపు కులస్తులు ఆదివారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గ్రామంలో కమ్యూనిటీ భవనం, సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతి పత్రం అందించారు.
వినతికి మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలో అధికారులతో మాట్లాడి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి