టాలీవుడ్ చిత్రాలకు మస్త్ గిరాఖీ పెరిగింది. రీసెంట్గా విడుదలైన సినిమాలే కాదు గతంలో మంచి విజయాలను సాధించిన చిత్రాలను కూడా ఇప్పుడు రీమేక్ చేసే పనిలో పడ్డారు. తాజాగా 2016లో ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ చిత్రం జనతా గ్యారేజ్ రీమేక్ కానున్నట్టు ప్రచారం జరుగుతుంది. జనతా గ్యారేజ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా, హిందీ రీమేక్ కూడా వారే చేయాలని అనుకుంటున్నారట.
రీసెంట్ గా మైత్రి నిర్మాణ సంస్థ బృందం సల్మాన్ని కలిసి భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చారట. ఈ వార్తలు నిజమైతే మూవీ 2023లో సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. జనతా గ్యారేజ్ చిత్రంలో మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా, సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించాడు.ఈ సినిమాను రీమేక్ చేస్తే హిందీ ప్రేక్షకులు కూడా తప్పక ఆదరిస్తారు. కాగా, సల్మాన్ ఇప్పటికే పలు తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.