ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ ఆరంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమవుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ పర్యావరణ పరిరక్షణలో ఓ మహత్కార్యమని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన విషయం తెలిసిందే. సోమవారం జన్మదినోత్సవాన్ని జరుపుకొన్న సీనియర్ హీరో సూపర్స్టార్ కృష్ణ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. నానక్రామ్గూడలోని తన స్వగృహంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ‘పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. ఎంపీ సంతోష్కుమార్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్య తీసుకువస్తున్నారు. ఆయన చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్ని మొక్కలు నాటాను’ అని అన్నారు. సూపర్స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు ఎంపీ సంతోష్కుమార్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.