బీజింగ్: చైనాలో తుఫాన్ బెంబేలెత్తిస్తున్నది. శక్తివంతమైన తుఫాన్ రావడంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. దాదాపు 238 మంది తీవ్రంగా గాయపడ్డారు. వుహాన్, సుజౌ నగరాల్లో సంభవించిన శక్తివంతమైన తుఫానులు రెండు నగరాలను అతలాకుతం చేశాయి. భారీ నష్టాలను కలిగించాయి. ఈ రెండు నగరాల్లోని చాలా ఇళ్ళు కూలిపోయాయి. నిర్మాణంలో ఉన్న స్థలాలు ధ్వంసమయ్యాయి. తుఫాను రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే సాధారణంగా ఈ ప్రాంతంలో తుఫానులు ఇంతవరకు రాకపోవడమే.
జిన్హువా వార్తా సంస్థ ప్రకారం, వుహాన్ నగరంలో ఆరుగురు మరణించారు. దాదాపు 218 మంది గాయపడ్డారని వుహాన్ ప్రభుత్వం తెలిపింది. తుఫాను గంటకు 86 కిలోమీటర్ల వేగంతో వీయడంతో నిర్మాణంలో ఉన్న చాలా ఇండ్ల తాత్కాలిక పైకప్పులు, చెట్ల ఎగిరిపోయాయి. అదేవిధంగా, సుజౌ నగరంలో కూడా భారీగానే నష్టం సంభవించింది. జియాంగ్సు ప్రావిన్స్కు తూర్పున 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న షెంగ్జే పట్టణంలో కూడా తుఫాన్ సంభవించి, ఒక వ్యక్తి మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. తుఫాను కారణంగా షెంగ్జేలోని భవనాలు ధ్వంసమయ్యాయి, విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి.
ఇలాఉండగా, ఎవరెస్ట్ శిఖరం అధిరోహణపై చైనా నిషేధం విధించింది. విదేశీ అధిరోహకుల ద్వారా కరోనా ఇన్ఫెక్షన్కు కారణమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేపాల్ నుంచి ఎవరెస్ట్ చేరుకుంటున్న అధిరోహకుల వల్ల కూడా ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉందని చైనా అభిప్రాయపడింది. నేపాల్లో కరోనా కేసులు ఉధృతంగా ఉన్నాయి. అందుకే నేపాల్ సరిహద్దులో చైనా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నది.
టీకాలు తీసుకున్నా.. మాస్క్లు మరువొద్దు : డాక్టర్ రణదీప్ గులేరియా
ఆధునిక హంగులతో రాజధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్
“మీ ప్రియమైన వారి చేయి వదలకండి”: టీనా అంబానీ సందేశం
తెరపైకొచ్చిన మిక్కీ మౌస్.. చరిత్రలో ఈరోజు
అక్కడ మసీదులు మాయమయ్యాయి.. ఎందుకంటే..?
ఉదయం చురుకైన నడకతో కరోనాకు చెక్..!
నేను చనిపోతే ఎవరెవరు వస్తారో చూస్తా..! ఓ మహిళ డెత్ రిహార్సల్
టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్పాట్ గెలుచుకోండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..