లోవోల్టేజీ.. బ్రేక్డౌన్.. ఒకప్పుడు విన్నమాటలు.. గాలిదుమారం వస్తే చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఒకప్పటిది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పల్లెల్లో విద్యుత్ సమస్యలు దూరమయ్యాయి. వ్యవసాయానికి 24గంటలపాటు నిరంతరాయంగాకరెంట్ సరఫరా అవుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న సబ్స్టేషన్లపై లోడ్ను తగ్గిస్తూ గ్రామాల్లో నూతన సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడంతో విద్యుత్వెలుగులు ప్రసరిస్తున్నాయి. మోర్తాడ్ మండలం దొన్పాల్, మాక్లూర్ మండలం బొంకన్పల్లి, ముల్లంగి(బీ) గ్రామాల ప్రజలు, రైతులు నూతన సబ్స్టేషన్ల నిర్మాణంతో హర్షం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మోర్తాడ్, మార్చి 29 : దశాబ్దాలపాటు తాము ఎదుర్కొన్న కరెంటు కష్టాలు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కృషితో దూరంకానున్నాయని మం డలంలోని దోన్పాల్ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని గ్రామానికి వచ్చిన ఎంతో మంది నాయకులకు గతంలో విన్నవించిన గ్రామస్తులు.. ఇక తమపరిస్థితి ఇంతేనని నిరాశకు గురయ్యా రు. ఈ క్రమంలో గ్రామస్తుల ఇబ్బందులను గుర్తించిన మంత్రి ప్రశాంత్రెడ్డి సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేయించారు.
కరెంటు కష్టాలు తీరినట్లే..
మోర్తాడ్ సబ్స్టేషన్ నుంచి దోన్పాల్ గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతోంది. లోవోల్టేజీ సమస్య తీవ్రంగా ఉండడంతో వ్యవసాయ మోట ర్లు కాలిపోవడం, సరైన సమయంలో పంటలకు నీరందించే పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో తెలియక అవస్థలు పడేవారు. ఇబ్బందులు దూరం చేస్తామని నాయకులు చెప్పే మాటలు విన్నామని, కానీ గ్రా మానికి ప్రత్యేకంగా సబ్స్టేషన్ వస్తుందని కలలో కూడా ఊహించలేదంటున్నారు. సబ్స్టేషన్ మంజూరు చేయించిన మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మంత్రి ఇప్పటికే వడ్యాట్, ధర్మోరా గ్రామాలకు సబ్స్టేషన్ను మంజూరు చేయించడంతోపాటు మోర్తాడ్, సుంకెట్, పాలెం గ్రామాల్లో సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచేందుకు నిధులు మంజూరు చేయడంతో పనులు పూర్తయ్యాయి.
ఇవీ కూడా చదవండి..
పసుపు పాలు తాగితే ఎన్ని లాభాలో..!
మాట నిలబెట్టుకున్న నాయకుడు సీఎం కేసీఆర్