మహబూబాబాద్, మే 30 : మైనర్పై లైంగి క దాడి చేసి హత్య చేసిన నిందితుడిని మరిపెడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నంద్యాల కో టిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో ఆదివారం సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మరిపెడ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక ఇంటర్ చదువుతున్నది. ఆ తండాకు పక్కనే ఉన్న మరో తం డాకు చెందిన ధరంసోత్ రాజేశ్ డిగ్రీ చదువుతున్నాడు. పక్కపక్క తండాలు కావడంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.
తాము ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని ఇద్దరు ఇళ్లల్లో తెలిపారు. బాలిక కుటుంబ పెద్దలు మరో రెండేళ్లు చదువుకోండి.. అపుడు పెళ్లి చేస్తామని చెప్పారు. శనివారం మైనర్ కుటుంబ స భ్యులు ఇంటి వద్ద లేకపోవడంతో ఇరువురు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్దకు రావాలని మైనర్ను రాజేశ్ కోరా డు. అక్కడికి వచ్చిన బాలికను రాజేశ్ సమీపంలోని మొండికట్ట గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లా డు. అనంతరం బాలికపై లైంగిక దాడి చేస్తుండగా ఆమె తల బండరాయికి తగిలింది. దీంతో స్పృహ తప్పిపడిపోవడంతో రాజేశ్ జరిగిన విషయాన్ని తండాకు చెందిన శ్రీనుకు ఫోన్ ద్వారా తెలిపాడు. శ్రీను బాలిక బావ శంకర్కు విషయం చెప్పాడు. వెంటనే ద్విచక్రవాహనంపై ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీను, శం కర్ బాలికను పక్కనే ఉన్న గూడెంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి చూపించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు మరిపెడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజేశ్ను ఎల్లారిగూడెం స్టేజీ వద్ద ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్పై 302, 376 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా, నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకున్న సీఐ సాగర్, ఎస్సై శ్రీనివాస్రెడ్డి, పర్యవేక్షించిన తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు.