ఈ ఏడాది ప్రారంభంలో సింగర్ సునీత బిజినెస్ మ్యాన్ రామ్ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సడెన్గా నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసి షాకిచ్చిన సునీత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. కరోనా వలన సునీత రెండో పెళ్లి కాస్త వాయిదా పడింది. ఈ ఏడాది జనవరిలో కొద్ది మంది సమక్షంలో సునీత- రామ్ పెళ్లి పీటలెక్కారు. రెండో పెళ్లి తర్వాత సునీత సంతోషంగా ఉంది.
ఈ మధ్య సునీత సోషల్ మీడియా ద్వారా లేదంటే ఇంటర్వ్యూలలో తన పర్సనల్ లైఫ్ విషయాలు చెప్పుకొస్తుంది. ఈ క్రమంలో తన రెండో పెళ్లికి బీజం ఎలా పడింది.. రామ్ ఎలా అప్రోచ్ అయ్యారు..ఎలా ప్రపోజ్ చేశారు? అనే విషయాలను బయట పెట్టేసింది సునీత. ప్రతి అమ్మాయికి మనల్ని పొగడాలి, చందమామతో పోల్చాలి, కబుర్లు చెప్పాలి అని ఇరవై ఏళ్ల వయస్సులో ఉన్న అమ్మాయికి సహజంగా ఉంటుంది.
నాకు అప్పుడు అలానే ఉండేది. నువ్ లేకపోతే చనిపోతాను.. నువ్వంటే ఇష్టం.. ఇలాంటి కబుర్లు ఎంతో మంది చెప్పారు. కానీ రామ్ అలాంటివేమీ చెప్పలేదు. రామ్ ఎంతో నిజాయితీ పరుడు. సొంత కష్టం మీద పైకి వచ్చారు. రామ్ చాలా మంచివాడు. ఒకరోజు మాట్లాడుతూ.. ప్రపోజ్ చేసేశాడు. నువ్వంటే నాకు ఇష్టం.. నువ్ నా లవ్, ప్రపోజల్ అంగీకరిస్తే.. నాకంటే అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు.. నువ్ అంగీకరించకపోతే.. కొంచెం బాధపడతానేమో. కానీ నా జీవితం నాకు ఉంటుంది.. ముందుకు వెళ్తాను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు నన్ను ఆలోజింపజేశాయి. రామ్ చెప్పిన దాంట్లో నిజం ఉందని భావించి ఆయనతో పెళ్లికి ఒప్పుకున్నాను అని సునీత పేర్కొంది