యాంకర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సింగర్గా అనేక బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన సునీత ఈ యేడాది మొదట్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త మ్యాంగ్ వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహాం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతనితో సంతోషకరమైన జీవితం గడుపుతున్న సునీత తన భర్త రామ్ వీరపనేనితో కలిసి వెబ్ సిరిస్ నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది సునీత.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సునీత పేర్కొన్నారు. సంగీత రంగం ఎంతో ఆనందంగా ఉందనీ, ఇక్కడే మరో మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాను కానీ మరోవైపు అడుగేయనని ఆమె చెప్పారు. సినిమాలలో నటిస్తున్నట్టు కూడా వార్తలు రాగా, వాటిని సునీత ఖండించింది. కాగా, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈటీవీలో హోస్ట్ చేసిన పాడుతా తీయగాకు సునీత వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రియాలిటీ షోలో ఈమెతో పాటు ఎస్పీ చరణ్, ప్రముఖ పాటల రచయత చంద్రబోస్ జడ్జ్గా వ్యవహరించనున్నట్టు సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.