మహబూబాబాద్ : మావోయిస్టు అగ్రనేత కత్తి మోహన్ రావు అలియాస్ ( ప్రకాశన్న, దామదాద) గుండె పోటుతో మృతి చెందాడని మావోయిస్టు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 10న గుండెపోటుతో మరణించినట్లు వారు పేర్కొన్నారు. మోహన్ రావు స్వస్థలం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామం. 39 ఏండ్ల క్రితమే ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్లు తెలిసింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోహన్ రావు చదువులో చురుకైన వాడు. ఇంటర్ మహబూబాబాద్, డిగ్రీ ఖమ్మం, పీజీ కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. డబుల్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఆయనకు అన్న, అక్క, తమ్ముడు, చెల్లె ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి తలసాని