హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలో కబడ్డీ లీగ్ ఇప్పటికే అపూర్వ ఆదరణ పొందగా, ఇప్పుడు ఖోఖో అభిమానులను అలరించనుంది. భారత ఖోఖో సమాఖ్య(కేకేఎఫ్ఐ), డాబర్ గ్రూపు సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది అల్టిమేట్ ఖోఖో లీగ్ సిద్ధమవుతున్నది. లీగ్ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 130 మంది ప్లేయర్లను ఎంపిక చేసి శిక్షణనిచ్చారు. ఇందులో మన తెలంగాణ నుంచి ఆనంద్కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శివారెడ్డి శిబిరంలో పాల్గొన్నారు. హైదరాబాద్ వాసి అయిన 31 ఏండ్ల ఆనంద్కుమార్ 2002లో ఖోఖో కెరీర్ను ప్రారంభించాడు. పొట్టకూటి కోసం భాగ్యనగరానికి వలస వచ్చిన ఆనంద్ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు జాతీయ సీనియర్ టోర్నీల్లో బరిలోకి దిగాడు.