‘టైగర్’ సినిమా అనంతరం దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత హీరో సందీప్కిషన్, దర్శకుడు వి.ఐ ఆనంద్ కలయికలో మరో సినిమా రాబోతున్నది. హాస్య మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఖుషి రవి, కావ్యథాపర్ కథానాయికలు. ముహూర్తపు సన్నివేశానికి హీరో అల్లరి నరేష్ క్లాప్నిచ్చారు. నాగశౌర్య కెమెరా స్విఛాన్ చేశారు. విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ ‘వినూత్నమైన కాన్సెప్ట్తో రూపొందుతున్న చిత్రమిది. ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. వెన్నెల కిషోర్, వైవాహర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్చంద్ర, సినిమాటోగ్రఫీ: సిద్.