ప్రతి ఒక్కరూ అందమైన ముఖాన్నే కోరుకుంటారు. ముఖం అందంగా ఉంటే అందరిలో మనం ప్రత్యేకంగా ఉంటాం. అలాంటిది మన అందాన్ని హరించేలా ముఖంపై గోధుమ రంగు మచ్చలు వస్తే.. అనుభవించే వారి బాధ చెప్పనలవి కాదు.
మచ్చలేని చర్మం ప్రతి ఒక్కరి కోరికల జాబితాలో ఉంటుంది. కానీ, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొన్ని చర్మ సంరక్షణ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నది. వాటిలో ఒకటి ముఖం మీద గోధుమ రంగు మచ్చలు.
ముఖంపై గోధుమ రంగు మచ్చలు ఇటీవల మరీ సర్వసాధారణమైపోయాయి. దీనికి చికిత్స చేయడం చాలా క్లిష్టంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ‘రంగు పాలిపోవడాన్ని విజయవంతంగా చికిత్స చేయడంలో కీలకం ఏమిటంటే.. మీరు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడమే. ఏ రకమైన పిగ్మెంటేషన్తో సంబంధం లేకుండా వాటికి చికిత్స చేయడానికి కొన్ని విషయాలు సాధారణం’ అని చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జుష్యా సరిన్ ఇన్స్టాగ్రామ్లో తెలపారు.
‘ముఖంపై వచ్చే మచ్చల చికిత్సలో ప్రాథమిక దశ కారణం తెలుసుకోవడం. కారణాన్ని గుర్తించకుండా చికిత్స చేయడం ఇబ్బందిగా ఉంటుంది’ అని సరిన్ చెప్పారు.
మీరు కూడా గోధుమ రంగు మచ్చలతో పోరాడుతుంటే.. సమర్థవంతమైన చికిత్స కోసం కొన్ని సాధారణ చిట్కాలు క్రింద ఉన్నాయి.. వాటిని పాటించండి.. అందమైన ముఖాన్ని మీ సొంతం చేసుకోండి..
మీరు బయటికి వెళ్తున్నారంటే.. ముఖానికి సన్స్క్రీన్ రాసుకోవడం తప్పనిసరి. ముఖంపై సూర్యరశ్మి నేరుగా పడకుండా జాగ్రత్త పడాలి. కళ్లకు చలువ అద్దాలు ధరించాలి. బయటికి వెళ్లడానికి 20-30 నిమిషాల ముందు సన్స్క్రీన్ను అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా ఎండకు గురైయ్యే ప్రదేశాలలో ఉంటే ప్రతి రెండు గంటల తర్వాత మళ్లీ అప్లై చేసుకోవాలి.
రెటినోయిడ్స్ వృద్ధాప్యం సంకేతాలను ఆలస్యం చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే వీటి వల్ల ముఖంపై వచ్చే చిన్న చిన్న రంగుల మచ్చలను తొలగించడానికి కూడా సహాయపడతాయి.
హైపర్ పిగ్మెంటేషన్ వల్ల కలిగే చర్మంలోని ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి సమయోచితంగా యాంటీ ఆక్సిడెంట్లను వాడాల్సి ఉంటుంది. విటమిన్ సీ, ఈ తోపాటు నియాసినమైడ్ లేదా గ్లూటాతియోన్ ప్రయత్నించడం ఉత్తమం.
‘గ్లైకోలిక్ ఆమ్లం, మాండెలిక్ ఆమ్లం, అజెలైక్ ఆమ్లం, టీసీఏ పనితీరును చర్మానికి పూయడం ద్వారా ముఖంపై మచ్చలు రాకుండా చూసుకోవచ్చు. ఇది నల్ల మచ్చలను మసకబారడానికి కూడా సహాయపడుతుంది.
చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే లేజర్ చికిత్సన ఆప్షన్ను ఎంచుకోవాలి. లేజర్ చికిత్స చాలా మొండిగా ఉండే వర్ణద్రవ్యం చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. లేజర్ తరంగదైర్ఘ్యాలు నలుపు / గోధుమ రంగు మచ్చల లోతుకు చేరుకోవడం ద్వారా నాశనం చేస్తాయి.
ఢిల్లీ దవాఖానలో వైద్య అద్భుతం.. 30 ఏండ్ల తర్వాత నోరు తెరిచిన మహిళ
నందిగ్రామ్లో అమిత్షా భారీ రోడ్షో
మహిళా సహాయకురాలితో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి అసభ్య ప్రవర్తన
ధర్నాలో కూర్చున్న వారిపైకి దూసుకొచ్చిన కారు.. ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు
బ్రెజిల్లో వ్యాక్సిన్ కొరత.. విదేశాంగ మంత్రి రాజీనామా?
బొగ్గు అక్రమ రవాణా కేసులో సీబీఐ ఎదుట హాజరైన కింగ్పిన్ లాలా
బంగ్లాదేశ్లో మోదీ పర్యటన.. షేక్ హసీనా మెడపై కత్తి
రాజస్థాన్ ఆవిర్భావ దినం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..