లెక్కల మాస్టర్ సుకుమార్ తను చేసే ఏ పనిలో అయిన క్రియేటివిటీ చూపిస్తుంటాడు. సినిమాలు లేదా వేడుకలలో తన క్రియేటివిటీ చూపిస్తూ ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు. సుకుమార్ 2009లో తబితని ప్రేమ వివాహం చేసుకోగా, వీరికి సుకృతి, సుకృత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రొఫెషనల్ లైఫ్తో ఎంత బిజీగా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్కి కొంత సమయం కేటాయిస్తుంటాడు సుకుమార్.
తాజాగా తబిత బర్త్ డే వేడుకలని గ్రాండ్గా నిర్వహించాడు. భార్య కోసం తాజ్ ఫలక్ నామాలో సుకుమార్ సర్ప్రైజ్ పార్టీ ఇచ్చినట్లు సమాచారం. వేడుకకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన తబిత.. ఆత్మీయుల మధ్య ఉన్నప్పుడు ఏ వేడుక అయిన అద్భుతంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం తబిత లాండ్రీ కార్డ్ పేరుతో ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటికే ‘లాండ్రీ కార్డ్’ పేరుతో మూడు బ్రాంచ్లను ఏర్పాటు చేశారు. ఇక సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. రెండు పార్ట్లుగా రూపొందుతున్న ఈ చిత్ర తొలి పార్ట్ డిసెంబర్ 25న విడుదల కానుంది.