లెక్కల మాస్టారు సుకుమార్ ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఇంటిలిజెన్స్ డైరెక్టర్స్ లిస్ట్లో ఒకరిగా మారారు. ఆయన తెరకెక్కించే సినిమాలపై దేశ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. చివరిగా రంగస్థలం సినిమాను తెరకెక్కించిన సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్తో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. రెండు పార్ట్లుగా తెరకెక్కనున్న ఈ చిత్రం పలు భాషలలో విడుదల కానుంది.
సుకుమార్ స్టైల్ ఆఫ్ టేకింగ్ చాలామందికి ఆదర్శం. అతని సినిమాలలో మంచి మెసేజ్ తప్పక ఉంటుంది. దర్శకుడిగానే కాకుంగా నిర్మాతగాను వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న సుకుమార్ సేవా కార్యక్రమాలలోను చాలా చురుకుగా ఉంటారు. ఆ మధ్య తన సొంతూరి ప్రాంతంలో పెద్ద మొత్తంలోనే ఖర్చుతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మరియు ఆక్సిజన్ సిలిండర్స్ ని పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు.
సుకుమార్ తండ్రి బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు గారి పేరిట స్వగ్రామం మట్టపర్రులో స్కూల్ నిర్మించారు.ఈ స్కూల్ ఓపెనింగ్కి సుకుమార్ చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నాడు. మధ్యాహ్నాం రెండు గంటలకు స్కూల్ ప్రారంభోత్సవం జరగనుంది.