భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది. నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉండటం విచారకరం.
జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్ పట్టణంలోని ఓ తోట. పంజాబీలకు అత్యంత ఇష్టమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్కు చేరుకున్నారు. ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు సైతం పాల్గొన్నారు.
ఇందులో భాగంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యాపాల్ను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. పంజాబ్లో యుద్ధ చట్టాన్ని అమలు చేసి, శాంతిభద్రతల బాధ్యతను బ్రిగేడియర్ జనరల్ డయ్యర్కు అప్పగించింది.
ఆందోళనలు ఇంకా ఆగలేదు. రౌలాట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 13 న అమృత్సర్లోని జలియన్ వాలా బాగ్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 25 నుంచి 30 వేల మంది హాజరయ్యారు.
జనరల్ డయ్యర్ తన దళాలతో అక్కడికి వచ్చి నిరాయుధ ప్రజలపై కాల్పులు జరుపుతానంటూ బెదిరించాడు. దాంతో అక్కడ గందరగోళం నెలకొన్నది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి పరుగెత్తటం ప్రారంభించారు. చాలా మంది తోటలోని బావిలోకి దూకారు. కాల్పులు సుమారు 10 నిమిషాలు కొనసాగాయి. ఇందులో వేయికి పైగా జనం మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.
జలియన్ వాలా బాగ్ ఉదంతానికి ప్రధాని థెరెసా మే క్షమాపణలు చెప్పాలని కోరుతూ భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మ బ్రిటన్ పార్లమెంట్లో 2017 అక్టోబరు 19న తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఐదుగురు ఎంపీల సంతకాలను కూడా వీరేంద్ర శర్మ సేకరించారు. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మలుపు తిప్పిన జలియన్ వాలా బాగ్ ఘటనను బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని ఆయన ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కేమెరూన్ భారత్ పర్యటనకు వచ్చినపుడు జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని బ్రిటీషర్లు చేసిన ఓ సిగ్గులేని చర్యగా అభివర్ణించారు.
షాజహాన్ తన రాజధాని ఆగ్రాను 1638 లో ఢిల్లీకి తీసుకురావాలని అనుకుని.. ఇందుకోసం ఎర్రకోట నిర్మాణాన్ని ఢిల్లీలో ప్రారంభించాడు. 1638 మే 13 న ఈ కోటకు పునాది వేయగా.. 10 సంవత్సరాల తరువాత సరిగ్గా ఇదే రోజున ఎర్ర కోట నిర్మాణం పూర్తయింది. షాజహాన్ ఎరుపు రంగును ఇష్టపడటంతో ఎర్ర ఇసుకరాయితో కోటను నిర్మించారని చెప్తారు. ఈ కారణంగా దీనిని ఎర్ర కోట అని పిలుస్తారు. భారత ప్రధాని ప్రతి ఏటా ఆగస్టు 15 న ఎర్ర కోట నుంచి తిరంగా జెండా ఎగురవేసి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేస్తారు. 2007 లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది.
2018: 65 వ జాతీయ చిత్ర పురస్కారాలు ప్రకటన.. వినోద్ ఖన్నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు బహుకరణ
2013: పాకిస్తాన్లోని పెషావర్లో బస్సు పేలుడులో ఎనిమిది మంది దుర్మరణం
2002: వెనిజులా అధ్యక్షుడైన సోషలిస్ట్ నాయకుడు హ్యూగో చావెజ్
1997: 21 సంవత్సరాల వయసులో యూఎస్ మాస్టర్స్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న టైగర్ వుడ్స్
1984: సియాచిన్ హిమానీనదంపై ఆపరేషన్ మేఘధూత్ను ప్రారంభించిన భారత సైన్యం
1984 : పాకిస్తాన్ను ఓడించి తొలిసారి ఆసియా కప్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్న టీమిండియా
1963: రష్యన్ గ్రాండ్ మాస్టర్ గారి కాస్పరోవ్ జననం
1940: రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా జననం
1939: భారతదేశంలో బ్రిటిష్ వారితో సాయుధ పోరాటం కోసం హిందూస్థానీ రెడ్ ఆర్మీ (ఇండియన్ రెడ్ ఆర్మీ) స్థాపనం
1898: నిర్మాత-దర్శకుడు, స్క్రీన్ రైటర్ చందులాల్ షా జననం
1849: గణతంత్ర రాజ్యంగా మారిన హంగరీ
1772: ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ కమిటీ ఛైర్మన్గా వారెన్ హేస్టింగ్స్ను నియామకం
1699: ఖల్సా పంత్ స్థాపించిన సిక్కుల పదో గురువు గోవింద్ సింగ్