సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, యువ నటుడు సుధీర్ బాబు ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ అనే సంగతి తెలిసిందే. నటుడిగా మారిన తర్వాత వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అలానే ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు చాలా కృషి చేస్తున్నాడు సుధీర్ బాబు. బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను లక్ష రూపాయలు అందిస్తున్నా, కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
తాజాగా సుధీర్ బాబు తన ట్వీట్లో హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఆ చిన్నారి కోసం రెండు లక్షలు వసూలు చేసాం. మరో లక్షన్నర కావాలి. దయచేసి మీకు చేతనంత సాయం చేయండని సుధీర్ బాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. గత ఏడాది వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఈ ఏడాది మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. పలాస దర్శకుడు కరుణాకర్ దర్శకత్వంలో ఆయన శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేస్తున్నారు.. అలాగే అయిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది అనే టైటిల్ ఫిక్స్ చేశారు.