యంగ్ రెబట్ స్టార్ ప్రభాస్ జోరు మాములుగా లేదు. వరుస పెట్టి సినిమాలకు కమిట్ అవుతూనే ఉన్నాడు.ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక మూవీ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే 2024 వరకు ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయాలనుకుంటున్నాడట ప్రభాస్.
ఇక సూరరై పోట్రు చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకురాలు సుధా కొంగర త్వరలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ముందు మహేష్ బాబు, విజయ్ పేర్లు తెరపైకి రాగా, తాజాగా ప్రభాస్ పేరు వినిపిస్తుంది. ఇటీవల సుధా కొంగర.. ప్రభాస్కు ఓ కథ వినిపించగా, అది డార్లింగ్కు ఎంతగానో నచ్చిందట. త్వరలో మరోసారి ఈ సినిమా గురించి ఇద్దరూ చర్చించుకోనున్నారని, ఆ తర్వాత అఫీషియల్ ప్రకటన చేయనున్నారని తెలుస్తుంది.