ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్ల హంగామా నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పలువురు ప్రముఖుల బయోపిక్స్ లైన్లో ఉన్నాయి. కొద్ది రోజులుగా స్టూవర్టుపురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాని నటిస్తాడని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఆ తర్వాత రానా పేరు తెరపైకి వచ్చింది. అనంతరం రవితేజ అన్నారు. కాని ఫైనల్గా బంతి బెల్లంకొండ కోర్టులోకి వచ్చి పడింది.
1980ల కాలంలో స్టూవర్ట్ పురం టైగర్ నాగేశ్వరరావు అనే పేరు సంచలనం. అతని మీద రకరకాల కథనాలు వున్నాయి. దొంగ అనీ, గజదొంగ అనీ, కాదు ..రాబిన్ హుడ్ టైపు అనీ, అతన్ని ఎన్ కౌంటర్ చేయడానికి అతడి ప్రియురాలిని ఒక పోలీసు అధికారి లోబరుచుకున్నాడని, ఎన్నో బ్యాంకులను కొల్లగొట్టిన టైగర్ నాగేశ్వరరావు .. చివరికి ఒక భారీ ఎంకౌంటర్లో చనిపోయాడు.అని చెప్పుకొచ్చారు.
ఆయన బయోపిక్ ను తెలుగు లో తెరకెక్కించి అన్ని భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కాని బెల్లంకొండ శ్రీనివాస్ పలు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడం, కరోనా వలన చిత్ర షూటింగ్ వాయిదా పడడం జరుగుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు స్టూవర్ట్ పురం దొంగ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ద్వారా తెలుపుతూ అతి త్వరలోనే షూటింగ్ మొదలు కానున్నట్టు స్పష్టం చేశారు.
కేఎస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను చేసేందుకు కమిట్ అయిన బెల్లంకొండ ప్రస్తుతం చత్రపతి సినిమా రీమేక్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి చేయడానికి చాలా సమయం పట్టేలా ఉంది. మరి ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియాల్సి ఉంది.