సుశాంత్ సింగ్కు దక్కిన గొప్ప గౌరవం

మంచి భవిష్యత్ ఉన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి అభిమానులకు పీడ కలగా మారింది. ఇప్పటికీ సుశాంత్ మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు తగిన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
గురువారం రోజు సుశాంత్ జయంతి కాగా, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎస్డీఎంసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రూస్ గంజ్లో ఉన్న స్ట్రెచ్ రోడ్డుకు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ రోడ్డులో ఎక్కువ మంది బీహార్ వాసులే నివసిస్తున్నారని ఇందుకోసం ఆ రోడ్డుకు సుశాంత్ పేరు పెట్టాలని సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభిషేక్ దత్ గత ఏడాది ప్రస్తావనకు తెచ్చారు. జనవరి 21న అమలులోకి తీసుకొచ్చారు. సుశాంత్కు దక్కిన ఈ అరుదైన గౌరవంపై అభిమానులు ఆనందిస్తున్నారు.
తాజావార్తలు
- 'పల్లా'కు సంపూర్ణ మద్దతు : ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం
- కన్ను గీటిన కైరా అద్వానీ..వీడియో
- స్నేహితుడి తల్లిపై అసభ్య ప్రవర్తన.. అడ్డుకున్నందుకు హత్య
- పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి : మంత్రి కొప్పుల
- ఆసియాలో అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముఖేష్ అంబానీ!
- డే అంతా ‘ఫ్రై’: నిమిషానికి రూ.1450 కోట్లు లాస్!
- క్రికెట్కు యూసుఫ్ పఠాన్ గుడ్బై
- మిషన్ భగీరథ భేష్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో