అనుమతి లేని విత్తనాల అమ్మకంపై కొరడా
విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు
రెండు రోజుల్లో రూ. 2.36 కోట్ల మిరప విత్తనాల సీజ్
అరెస్టుల పర్వం.. అక్రమార్కుల్లో గుబులు
వరంగల్రూరల్, జూన్ 9(నమస్తేతెలంగాణ): అనుమ తి లేని విత్తనాల అమ్మకందారులపై అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సు మారు రూ.2.36 కోట్ల విలువ చేసే మిరప విత్త నాలను సీజ్ చేశారు. ఈ విత్తనాలన్నీ ఒకే కంపెనీకి చెందినవి కావ డం విశేషం. వానకాలం పంటల సీజన్ను పురస్కరించు కుని మార్కెట్లోకి నకిలీ, అనుమతి లేని విత్తనాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. కొద్ది రోజుల నుంచి టాస్క్ఫోర్స్ బృందాల్లోని అధికారులు విత్త న గోదాములు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. విత్తన నిల్వలను పరిశీలించి వాటికి ప్రభుత్వ అనుమతి ఉందా? లేదా? అనేది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పోలీసు, వ్యవసాయశాఖ అధికా రులు పరకాల పట్టణంలోని పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్ దు కాణంలో సోదాలు జరిపారు.
అమ్మకానికి అనుమతి లేని 4,325 మిరప విత్తన ప్యాకెట్ల నిల్వలను గుర్తించారు. ద్వారకా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన స్టార్ బిందు అనే ఎఫ్ 1 హైబ్రిడ్ రకం మిరప విత్తనాల అమ్మకానికి వ్యవసా యశాఖ కమిషనర్ నుంచి అనుమతి లేదని ప్రకటించారు. ఒక్కో ప్యాకెట్లో ఎనిమిది గ్రాముల మిరప విత్తనాలు ఉన్నట్లు పేర్కొంటున్న వీటి గరిష్ఠ ధర ఒక్కో ప్యాకెట్కు రూ.2,500 ఉంది. ఈ లెక్కన పరకాలలోని షాపులో గుర్తించిన 4,325 మిరప విత్తన ప్యాకెట్ల విలువ దాదాపు రూ.1.08 కోట్లుగా వెల్లడించారు. వీటిని సీజ్ చేసి స్వాధీన పరుచుకున్నారు. అనంతరం వ్యవసాయశాఖ కార్యాలయా నికి తరలించారు. ఈ మిరప విత్తనాల అమ్మకానికి వ్యవ సాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి లేదని పరకాల వ్యవసాయ సహాయ సంచాలకులు(ఏడీఏ) రవీందర్ చెప్పారు. ఈ మేరకు పరకాల పోలీసులు వ్యాపారి సతీశ్పై కేసు నమోదు చేశారు. బుధవారం అతన్ని అరెస్టు చేసినట్లు పరకాల ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. అనుమతి లేని విత్తనాల అమ్మకం కేసులో ఈ ఏడాది ఒక విత్తన వ్యాపా రిని అరెస్టు చేయడం ఇక్కడిదే ప్రథమం.
ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు
పరకాలలో జరిగిన సోదాల్లో లభించిన కీలక ఆధారా లతో పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు నర్సంపేట పట్ట ణంలోని ఒక విత్తన దుకాణంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ దుకాణంలో స్టార్ బిందు రకం హైబ్రిడ్ మిరప విత్తన ప్యాకెట్ల నిల్వలను పట్టుకున్నారు. 1,900 కుపైగా ప్యాకెట్లను ఇక్కడ స్వాధీనం చేసుకున్నామని, వీటికీ అనుమతి లేదని ప్రకటించారు. ఈ ప్యాకెట్ల విలువ రూ.48 లక్షలు ఉంటుందని తెలిపారు. దుకాణం యజమాని స్టార్ బిందు రకం హైబ్రిడ్ మిరప విత్తన ప్యాకెట్లను వందకుపైగా అమ్మినట్లు గుర్తించారు. ఈ విత్తనాలు కొన్న రైతులు వాటి ని వాపస్ చేయాలని కోరారు. వ్యవసాయశాఖ అధికారుల ఫిర్యాదుతో దుకాణం యజమానిపై నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
పరకాలలో నమోదైన కేసు విచారణలో భాగంగా బుధవారం మరో 3,200 స్టార్ బిందు రకం హైబ్రిడ్ మిరప విత్తన ప్యాకెట్లను స్వాధీన పరుచుకున్న పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు వరంగ ల్లోని ఒక షాపుపై కేసు నమోదు చేశారు. అనుమతి లేని ఈ ప్యాకెట్ల విలువ రూ.80 లక్షలుగా తెలిపారు. స్టార్ బిందు రకం హైబ్రిడ్ మిరప విత్తన ప్యాకెట్ల నిల్వలు ఇంకా పలు విత్తన దుకాణాల్లో ఉన్నాయనే సమాచారంతో టాస్క్ఫోర్స్ అధికారులు కూపీ లాగుతున్నారు. షాపుల్లో తనిఖీలకు ప్లాన్ చేస్తున్నారు. వానకాలం సీజన్ ప్రారంభం లోనే అనూహ్య రీతిలో అనుమతి లేని రూ.2.36 కోట్ల విలువ చేసే హైబ్రిడ్ రకం మిరప విత్తన ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ అధికారులు విత్తన దుకాణాల్లో పట్టుకోవడం, స్వాధీ న పరుచుకోవడం కలకలం సృష్టించింది. ముఖ్యంగా అక్ర మార్కుల్లో గుబులు పుట్టించింది.
అమ్మకానికి అనుమతి లేదు
స్టార్ బిందు రకం హైబ్రిడ్ మిరప విత్తనాల అమ్మకానికి అనుమతి లేదు. రూ.2.36 కోట్ల విలువ చేసే అనుమతి లేని మిరప విత్తన ప్యాకెట్లను పట్టుకుని స్వాధీన పరుచుకున్నం. వీటిని అమ్ముతున్న వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటం. అనుమతి లేని విత్తనాలు అమ్మే వ్యాపారులపై పీడీ యాక్టు ప్రయోగించాలని కూడా పోలీసు శాఖను కోరుతం. నాణ్యత పరిశీలన కోసం వీటి నమూనాలను ల్యాబ్కు పంపిస్తం. విత్తనాలు కొనే రైతుల కచ్చితంగా డీలర్ల నుంచి రసీదు పొందాలి. పంటకాలం ముగిసే వరకూ దాన్ని భద్రపరచాలి.
ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి
అనుమతి లేని మిరప ప్యాకెట్ల పట్టివేత
అనుమతిలేని, నకిలీ విత్తనాలపై టాస్క్ఫోర్స్ ప్రత్యేక దృష్టి పెట్టింది. విత్తన షాపుల్లో పోలీసులు, వ్యవసాయ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందు లో భాగంగా బుధవారం పరకాల, నర్సంపేట, వరంగల్ లోని దుకాణాల్లో అనుమతి లేని మిరప ప్యాకెట్లను పట్టుకున్నారు. సుమారు రూ. 2.36 కోట్ల సీడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. టాస్క్ఫోర్స్ తని ఖీల్లో పరకాలలోని పరమేశ్వర ఆగ్రో ఏజన్సీస్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని ద్వారకా సీడ్స్కు చెందిన స్టార్బిందు ఎఫ్1 రకం విత్తనాలు పట్టుబడ్డాయి. షాపు యజమాని దేవా సతీశ్పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న 4,320 ప్యాకెట్ల విత్తనాల విలువ రూ. కోటీ ఎనిమిది లక్షలు ఉంటుందని ఏసీపీ ఎస్ శ్రీనివాస్ తెలిపారు. నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్లోని అఖిలనామ సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ షాపులో ఇవే 1953 విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. రూ.48, 82,500 విలువైన సీడ్స్ను వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్యాకెట్ 8 గ్రాములు ఉండగా, రూ. 2500కు విక్రయిస్తు న్నారు. వ్యాపారితోపాటు డిస్ట్రిబ్యూటర్పై పోలీసుల కు ఫిర్యాదు చేశారు. వరంగల్ స్టేషన్రోడ్లోని పరమేశ్వరీ ఆగ్రో ఏజన్సీ విత్తన షాపులో 330 ప్యాకెట్ల స్టార్ బిందు రకం నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. వాటి విలువ సుమారు రూ. 80 లక్షల వరకు ఉంటుందని అధికారు లు అంచ నా వేశారు. ఆయా కార్యక్రమాల్లో నర్సంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు తోట శ్రీనివాసరావు, పరకాల ఏడీఏ రవీందర్, ఏవోలు కృష్ణ కుమార్, శ్రీనివాస్, విజ్ఞాన్, ఏఈవో అశోక్, సీఐ పింగిళి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.