మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సోమవారం హోలీ వేడుకలు నిర్వహించారు. చిన్నారులు, యువకులు, పెద్దలు ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు. యువకులు డప్పుచప్పుళ్లు, బ్యాండుమేళాల నడుమ కేరింతలు కొడుతూ నృత్యం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సంబురాలు పూసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయా కాలనీల్లో చిన్నారులు, యువకులు, మహిళలు పోటీపడి రంగులు చల్లుకున్నారు. సీసీసీ నస్పూర్లో చిన్నారులు, యువతులు రంగునీళ్లు చల్లుకున్నారు. సమీప గోదావరిలో స్నానాలు చేశారు. ప్రజాప్రతినిధులు, బస్తీ పెద్దలు పాల్గొన్నారు. తాండూర్లోని కొన్ని చోట్ల మాత్రమే వేడుకలు జరుపుకున్నారు. ఐబీలో శ్రీ గణేశ్ మండలి యువకులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, సహజ రంగులను చల్లుకున్నారు. మాదారం కార్మిక క్షేత్రంలో యువకులు, కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు జాజిరి పాటలు పాడారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు, యువతులు, యువకులు రంగుల్లో మునిగితేలారు. పద్మశాలీ సంఘం, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇంటింటికీ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కెరమెరి మండలంలో ఆదివాసులు కాముని దహనం చేసిన ప్రాంతంలో అన్ని రకాల ధాన్యాలతో తయారు చేసిన గుడాలతో నైవేద్యం సమర్పించి, సహపంక్తి భోజనాలు చేశారు.
ఇవి కూడా చదవండి
మద్యం మత్తులో భార్యను గొంతు నులిమి చంపిన భర్త
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ప్రొఫైల్ ఇదే!