కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
ఉద్యమంలా పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు
కోస్గి, జూలై 1 : పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు ఉద్యమం లా కొనసాగాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అ న్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కా ర్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారాయని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో 50 శాతం సీజనల్ వ్యాధులు తగ్గాయన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందించి నాటించాలన్నారు. అనంత రం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండలంలోని మీర్జాపూర్, బిజ్జారం, చెన్నారం గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రగతితో వార్డు సమస్యల పరిష్కారం’
నారాయణపేట, జూలై 1 : పట్టణ ప్రగతి కార్యక్రమంతో వా ర్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోచ్చని మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ అన్నారు. పట్టణంలోని 10వ వా ర్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ని ర్వహించిన వార్డు సభలో ఆమె మాట్లాడారు. పాలకవర్గ సభ్యు ల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. వార్డులకు వచ్చే అధికారులకు సమస్యలు తెలియజేసి వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మున్సిప ల్ కమిషనర్ భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గం దె చంద్రకాంత్, ప్రత్యేక అధికారి నాగరాజ్, వార్డు ప్రజలు పా ల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించారు. 3వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్ అనిత, ప్రత్యేక అధికారి జబ్బార్, ఎలక్ట్రికల్ లైన్మెన్ రాజునాయక్, రాఘవేందర్రెడ్డి, ఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 18 వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతిలో కౌ న్సిలర్ గురులింగం వార్డుసభ నిర్వహించి ప్ర త్యేక కార్యాచరణ రూపొందించారు. 16వ వా ర్డులో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ప్రత్యేక అ ధికారి ప్రమీల, కౌన్సిలర్ అంబిక, ఆర్పీలు, అం గన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రగతి నివేదిక తెలియజేయాలి
మక్తల్, జూలై 1 : పట్టణ ప్రగతి పురోగతి ప్రగతి నివేదిక ప్రజలకు తెలియజేయాలని మున్సిపల్ చైర్పర్సన్ పావని అన్నారు. పట్టణ ప్రగతి మొదటి రోజు మున్సిపాలిటీలో 16వ వార్డు స్పెషల్ అధికారి కౌన్సిలర్తో కలిసి వార్డు సమస్యలపై సమావేశమయ్యారు. కార్యక్రమా ల్లో మండల ప్రత్యేక అధికారి, వార్డు ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.